వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే..
అమ్మయిలన్నాక వంటా వార్పు నేర్చుకోవాలంటారు పెద్దలు. అంటే వారికి సహాయం చేస్తారని కాదు. పెళ్లయ్యాక సంసారాన్ని చక్కదిద్దుకుంటారని. అయితే చాలా మంది గారాబంగా సున్నితంగా పెరగడం వల్ల ప్రస్తుత రోజుల్లో...
అమ్మయిలన్నాక వంటా వార్పు నేర్చుకోవాలంటారు పెద్దలు. అంటే వారికి సహాయం చేస్తారని కాదు. పెళ్లయ్యాక సంసారాన్ని చక్కదిద్దుకుంటారని. అయితే చాలా మంది గారాబంగా సున్నితంగా పెరగడం వల్ల ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు వంట చేయడం రావడం లేదు. దీంతో పెళ్లి అయిన తర్వాత అత్త వారింట్లో కష్టాలు పడుతున్నారు. ఈ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారు కచ్చితంగా వంట చేయడం నేర్చుకోవాల్సిందే. మారుతున్న కాలంలో అబ్బాయిలు కూడా అద్భుతంగా వంట చేస్తున్నారు. స్వయంగా వంట చేసుకోవడం ద్వారా సంతృప్తితో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ కొందరు మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో.. నిండు జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది.
తమిళనాడులోని మూనైంచీపట్టి సమీపంలోని గీజాగోడంకుళం ఉత్తర వీధికి చెందిన గుప్పురాజ్.. ఆయన భార్య కనకమణి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గుప్పురాజ్ గతంలోనే చనిపోయాడు. అతని కుమార్తె క్రిస్టిల్లా మేరీ.. వివాహం ఇటీవల నిర్ణయించారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రిస్టిలా మేరీ ఇంటి పనులు చేయకుండా తరచూ సెల్ ఫోన్ చూస్తూ ఉండేది. దీంతో ఆమెపై తల్లి కోప్పడింది. ‘నీకు పెళ్లవుతోంది, ముందు వంట నేర్చుకో’ అని సూచించింది.
ఇలా పదే పదే చెబుతుండటంతో క్రిస్టిల్లా మేరీ మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. కూకరైపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి నిశ్చయించుకుని వంట నేర్చుకోమని తల్లి చెప్పడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..