AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ఎన్నికల వేళ పంజాబ్ లో ఆర్డీఎక్స్ కలకలం.. భారీమొత్తంలో దొరికిన విధ్వంసకర కెమికల్!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్డీఎక్స్(RDX)కలకలం రేపింది. ఇక్కడ భారీస్థాయిలో అంటే 2.5 కిలోల ఆర్‌డిఎక్స్ పట్టుబడింది. పాకిస్తాన్ (Pakistan)లో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్)కి చెందిన ఉగ్రవాది లఖ్‌బీర్ రోడే దీన్ని సరఫరా చేశాడు.

Punjab: ఎన్నికల వేళ పంజాబ్ లో ఆర్డీఎక్స్ కలకలం.. భారీమొత్తంలో దొరికిన విధ్వంసకర కెమికల్!
Punjab
KVD Varma
|

Updated on: Jan 14, 2022 | 8:21 AM

Share

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్డీఎక్స్(RDX)కలకలం రేపింది. ఇక్కడ భారీస్థాయిలో అంటే 2.5 కిలోల ఆర్‌డిఎక్స్ పట్టుబడింది. పాకిస్తాన్ (Pakistan)లో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్)కి చెందిన ఉగ్రవాది లఖ్‌బీర్ రోడే దీన్ని సరఫరా చేశాడు. పంజాబ్ పోలీసులు(Punjab Police) కొద్ది రోజుల క్రితం ఆరుగురు ఐఎస్‌వైఎఫ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గురుదాస్‌పూర్‌లోని లఖన్‌పాల్ గ్రామానికి చెందిన అమన్‌దీప్ కుమార్ అలియాస్‌ను విచారించిన తర్వాత ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద ఈ భయానక పేలుడు పదార్థం కనుగొన్నారు. ఆర్డీఎక్స్ తో పాటు, డిటోనేటర్, కోడెక్స్ వైర్, 5 పేలుడు ఫ్యూజులు .. వైర్లు .. ఎకె 47 12 లైవ్ కాట్రిడ్జ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పఠాన్‌కోట్‌లోని ఆర్మీ కాంట్ గేట్‌పై గ్రెనేడ్ దాడికి పాల్పడింది ఇదే ఉగ్రవాద సంస్థ కావడం గమనార్హం. దీంతో ఈ ఉగ్రవాద సంస్థ పంజాబ్ లో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధం అయిందనే వాదనలకు బలం చేకూరుతోందని భావిస్తున్నారు.

ఐఈడీని ఆర్డీఎక్స్ ద్వారా అసెంబుల్ చేయాల్సి ఉంది

ఎస్బీఎస్ నగర్ ఎస్ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్ నిందితుడు అమన్‌దీప్‌ను విచారించిన వెంటనే, గురుదాస్‌పూర్ జిల్లాకు పోలీసు బృందాలను పంపడం ద్వారా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థం ద్వారా ఐఈడీలను సమీకరించాల్సి ఉందని అమన్‌దీప్‌ తెలిపారు. ఈ పేలుడు పదార్థాలను ఈ టెర్రర్ మాడ్యూల్ హ్యాండ్లర్ అయిన సిక్కు భిఖారీవాల్ పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాది లఖ్‌బీర్ రోడ్ ద్వారా తనకు పంపాడని అమన్‌దీప్ చెప్పినట్లు ఎస్ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్ చెప్పారు.

లఖ్‌బీర్ రోడే డ్రోన్ ద్వారా పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలను పంపుతున్నాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్-జూలై 2021లో, లఖ్‌బీర్ రోడ్, పాకిస్తాన్‌లో కూర్చొని, పంజాబ్ .. బయటి దేశాలలో తన టెర్రర్ మాడ్యూల్ ద్వారా వరుస ఉగ్రవాద సంఘటనలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆర్డీఎక్స్, టిఫిన్ బాంబులతో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను సరిహద్దు నుంచి భారత్‌కు రవాణా చేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్లను ఉపయోగించారు. ఇందుకోసం సరిహద్దుల్లోని స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి: Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!