AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: పొలాల మధ్య ఇంట్లో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్వహణ.. భారీ పేలుడుతో నలుగురు మృతి..

ప్పటివ‌ర‌కు న‌లుగురి మృత దేహాలను వెలికితీశారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల‌ను అభిషేక్ (20), రయీస్ (40), ఆహద్ (05), వినోద్‌గా గుర్తించారు. పేలుడు జరిగిన ఇంటిని

విషాదం: పొలాల మధ్య ఇంట్లో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్వహణ..  భారీ పేలుడుతో నలుగురు మృతి..
Bomb Blast
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2023 | 8:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని పొలాల మధ్యలో ఉన్న ఒక ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించినట్టుగా తెలిసింది. హుటా హుటినా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఇంట్లోనే కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్గుగా తెలిసింది. అదే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో నలుగురు మృతి చెందారు. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించేంత బలంగా ఉందని స్థానికులు చెప్పారు. సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలం నుంచి సిలిండర్ల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన ఇల్లు కూలిపోయిందనీ, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవ‌కాశాలున్నాయి. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చంటున్నారు అధికారులు.

ప్ర‌స్తుతం అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పటివ‌ర‌కు న‌లుగురి మృత దేహాలను వెలికితీశారు. నగర్ కొత్వాలి ప్రాంతంలోని ధికోలి రోడ్డులోని దక్ష్ మ్యారేజ్ హోమ్ సమీపంలో నడుస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల‌ను అభిషేక్ (20), రయీస్ (40), ఆహద్ (05), వినోద్‌గా గుర్తించారు. పేలుడు జరిగిన ఇంటిని వీరు అద్దెకు తీసుకున్నార‌ని స‌మాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..