AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే!

ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు ఈ బిల్లుతో పూర్తి స్వేచ్చ లభిస్తుంది.

ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే!
Obc Bill In Lok Sabha
Balaraju Goud
|

Updated on: Aug 10, 2021 | 7:42 PM

Share

127th Constitution Amendment OBC Bill: ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు ఈ బిల్లుతో పూర్తి స్వేచ్చ లభిస్తుంది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. లోక్ సభలో ఓబీసీ కోటాకు సంబంధించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ 127వ సవరణ బిల్లు 2021ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టింది. నిన్ని ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలకు లభించనుంది. ఈ బిల్లుకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. గతంలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుకుందని కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. అలాగే, మరాఠా రిజర్వేషన్లపైనా కేంద్రం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

టీఆర్ఎస్, బీజేడీ, ఎల్‌జేపీ, జేడీయూ ఈ బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశాయి. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రిజర్వేషన్ల సమస్యను ఇది పరిష్కరిస్తుందని లోక్‌సభ సభ్యులు అభిప్రాయపడ్డారు. మరోవైపు, శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మరాఠాల రిజర్వేషన్లపై గళం వినిపించారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైసీపీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ.. పెగాసస్ మీద కూడా చర్చకు ఒప్పుకొంటే ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు.

ఓబీసీల రిజర్వేషన్ల కోసం డీఎంకే పోరాడిందని ఆ పార్టీ ఎంపీ బాలు గుర్తు చేశారు. మరోవైపు, ఓబీసీలకు కాంగ్రెస్ ఎలాంటి రిజర్వేషన్లను ఇవ్వలేదని, కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఓబీసీల క్రిమిలేయర్ పరిమితిని పెంచారని వ్యాఖ్యానించారు.

Read Also… National Anthem: ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి..?

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!