AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ హలీడేస్‌ టూర్‌ ప్లాన్ చేస్తున్నారా..? మన దేశంలోని అందమైన, అద్భుత ద్వీపాలివి.. ఓ సారి చూసేయండి..

భారతదేశంలో లక్షద్వీప్‌తో పాటు అనేక ద్వీపాలు ప్రకృతి అందాలతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలను సందర్శించిన ప్రతి ఒక్కరి మనసు స్వర్గలోకపు అంచులను తాకివస్తుంది. అక్కడి వెళితే మీరు సహజ సౌందర్యాన్ని ఆస్వాదించగలరు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం మన దేశంలోని అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం.

సమ్మర్‌ హలీడేస్‌ టూర్‌ ప్లాన్ చేస్తున్నారా..? మన దేశంలోని అందమైన, అద్భుత ద్వీపాలివి.. ఓ సారి చూసేయండి..
Tourism
Jyothi Gadda
|

Updated on: Feb 22, 2024 | 6:14 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ ప్రత్యేక ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ మన భారతదేశంలో లక్షద్వీప్‌తో పాటు ప్రకృతి అందాలతో నిండిన అనేక ఇతర ద్వీపాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో లక్షద్వీప్‌తో పాటు అనేక ద్వీపాలు ప్రకృతి అందాలతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలను సందర్శించిన ప్రతి ఒక్కరి మనసు స్వర్గలోకపు అంచులను తాకివస్తుంది. అక్కడి వెళితే మీరు సహజ సౌందర్యాన్ని ఆస్వాదించగలరు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం మన దేశంలోని అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం.

మజులి ద్వీపం: నదిపై నిర్మించిన మజులి ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఈ ద్వీపంలోని సహజ సౌందర్యం చాలా అందంగా కనిపిస్తుంది. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. మజులి ద్వీపానికి చేరుకోవడానికి ప్రయాణికులకు పడవలు అందుబాటులో ఉంటాయి. ఇది రోజుకు రెండుసార్లు మాత్రమే నడుస్తుంది. గౌహతి మరియు జోర్హాట్ విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నాయి.

డయ్యూ ద్వీపం: డయ్యూ ద్వీపంలో పోర్చుగీస్ సాంస్కృతిక, వాస్తుశిల్పం జాడలు చూడవచ్చు. ఈ ద్వీపానికి అనేక నగరాల నుండి విమానాల ద్వారా చేరుకోవడం చాలా సులభం. గుజరాత్‌లోని ఈ ద్వీపం దాని అందమైన బీచ్, సీఫుడ్ కారణంగా పర్యాటకులకు ఉత్తమమైన ప్రదేశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్‌లో ఉంది ఈ ద్వీపం. ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది.

దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. ఈ ద్వీపం పంజిమ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌గా పిలుస్తారు.

సెయింట్ మేరీస్ ద్వీపం : సెయింట్ మేరీస్ ద్వీపం 4 చిన్న దీవులతో కూడిన సమితి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ క్రిస్టల్ శిలలు ఏర్పడతాయి. ఇక్కడికి చేరుకోవడానికి మాల్పే నుండి పడవలో ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఈ ద్వీపంలో వసతి సౌకర్యం లేదు.

పాంబన్ ద్వీపం: రామేశ్వరం ద్వీపం ఇది తమిళనాడులో ఉంది. దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. తెల్లని ఇసుక బీచ్‌ల కారణంగా పాంబన్ ద్వీపం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. మీరు తమిళనాడు పర్యటనలో ఉన్నట్లయితే, ఈ ద్వీపం అందాలను ఖచ్చితంగా చూడండి. ఇక్కడకు చేరుకోవడం కూడా చాలా సులభం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us