Lifestyle: బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?

ఇక మరికొందరైతే ఎలాగైనా త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్ కూడా చేస్తుంటారు. సన్నగా అవ్వాలన్న కోరికతో కడుపుమాడ్చుకుంటారు. ఇందులో భాగంగానే రాత్రి పూట భోజనం చేయడం మార్చేస్తుంటారు. అయితే రాత్రి పూట మనం తీసుకునే ఆహారం కచ్చితంగా బరువుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం...

Lifestyle: బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
Dinner
Follow us

|

Updated on: May 06, 2024 | 5:41 PM

బరువు కంట్రోల్‌లో ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. నాజుగ్గా ఉండాలని భావిస్తుంటారు. నిజానికి ఊబకాయంతో ఇబ్బంది పడే వారిలో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు వర్కవుట్స్‌ చేస్తే మరికొందరు వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తుంటారు.

ఇక మరికొందరైతే ఎలాగైనా త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్ కూడా చేస్తుంటారు. సన్నగా అవ్వాలన్న కోరికతో కడుపుమాడ్చుకుంటారు. ఇందులో భాగంగానే రాత్రి పూట భోజనం చేయడం మార్చేస్తుంటారు. అయితే రాత్రి పూట మనం తీసుకునే ఆహారం కచ్చితంగా బరువుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే త్వరగా భోజనం చేయాలని సూచిస్తుంటారు.

దీంతో మనలో చాలా మంది రాత్రి భోజనం చేయడాన్ని పూర్తిగా మానేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపునణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం విషయంలో రాత్రి పూట భోజనం మానేయడం వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు ఉంటుండొచ్చు కానీ దీర్ఘకాలంలో మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అలాగే ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో ఉదయం పూట సహజంగానే ఎక్కువగా ఆహారం తీసుకుంటారు.

ఇక రాత్రుళ్లు భోజనం మానేయడం వల్ల సూక్ష్మపోషకాల లోపం సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం దాటవేయడం వల్ల నిద్రకు ఆటంకాలు, శరీరం శక్తి స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్లో తేడాలు ఏర్పాడుతాయి. ఈ కారణంగా శరీరం చేతులు వనకడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అలాగే మధుమేహం ఉన్న వ్యక్తులు, రాత్రి డిన్నర్‌ స్కిప్‌ చేస్తే మరీ ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇన్నోవేషన్ ఇన్ ఏజింగ్ అనే జర్నల్‌లో 2020లో ప్రచురించి అధ్యయనం ప్రకారం.. భోజనం మానేసిన వృద్ధులు డిప్రెషన్, యాంగ్జయిట, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కున్నట్లు తేలింది. సరైన సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ