యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? షాకింగ్‌ కారణాలను తెలుసుకోండి..

మొత్తమ్మీద ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని, దీని వల్ల మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? షాకింగ్‌ కారణాలను తెలుసుకోండి..
Junk Food Alert
Follow us

|

Updated on: May 06, 2024 | 12:59 PM

వృద్ధులకు మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకుంటే పొరపాటే. ఇది తప్పుడు ఆలోచన. స్థూలకాయం, తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో యువతలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 30 సంవత్సరాలలో పరిశీలించినట్టయితే.. కడుపు, పిత్తాశయం, పెద్దప్రేగు, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ చాలా వేగంగా పెరిగింది. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధులు ఇప్పుడు 40-50 ఏళ్లలోపు వారిలో కూడా కనిపిస్తున్నాయి. తీపి, ఉప్పు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబిన్ వార్డ్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లలో, 30 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో పిత్తాశయ క్యాన్సర్ సంభవం 200శాతం, గర్భాశయ క్యాన్సర్ 158శాతం, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) 153శాతం, మూత్రపిండాలు 89శాతం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 83శాతం పెరిగిందని చెప్పారు.

ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?

మొత్తమ్మీద ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని, దీని వల్ల మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్‌ను ఎలా నివారించాలి..?

గర్భాశయ, కొలొరెక్టల్ (పెద్దప్రేగు) వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లు ప్రారంభ దశలో గుర్తించినట్టయితే సులభంగా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. కానీ బ్రెయిన్ క్యాన్సర్ లాంటి జబ్బుల్లో ముందుగా గుర్తించినా ప్రయోజనం ఉండదు. సెర్వికల్, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవే ఉత్తమ మార్గాలని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను టీకాలు వేయడం ద్వారా నివారించవచ్చు. ముందుగానే గుర్తిస్తే చికిత్స కూడా చేయవచ్చు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) సంక్రమణ గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. టీకాలు వేయడం ద్వారా నివారించవచ్చు. రొమ్ము, గర్భాశయ, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ కోసం జాతీయ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లను విస్తరించడం చికిత్సలో సహాయపడుతుంది. మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సరైన రకం క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ప్రయోజనకరమని, అయితే ప్రస్తుతం నడుస్తున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు వయస్సుపై ఆధారపడి ఉంటాయి. ప్రమాదంపై ఆధారపడి ఉండవని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్