AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Can Diabetics Eat Mangoes: మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..? తినకూడదా..?

మధుమేహ వ్యాధిగ్రస్తుల డైట్‌ విషయంలో ఎప్పుడూ సందిగ్ధతకు లోనవుతుంటారు. ఏది తినాలి? ఏది తినకూడదు అనే క్లారిటీ ఉండదు. సీజనల్ పండ్ల విషయంలో ఈ సందిగ్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవిలో నోరూరించే మామిడి పండ్లు ఎవరైనా తినకుండా ఉండగలరా..? షుగర్ పేషెంట్లు మామిడిపండు..

Can Diabetics Eat Mangoes: మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..? తినకూడదా..?
Can Diabetics Eat Mangoes
Srilakshmi C
|

Updated on: Apr 09, 2023 | 9:31 AM

Share

మధుమేహ వ్యాధిగ్రస్తుల డైట్‌ విషయంలో ఎప్పుడూ సందిగ్ధతకు లోనవుతుంటారు. ఏది తినాలి? ఏది తినకూడదు అనే క్లారిటీ ఉండదు. సీజనల్ పండ్ల విషయంలో ఈ సందిగ్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవిలో నోరూరించే మామిడి పండ్లు ఎవరైనా తినకుండా ఉండగలరా..? షుగర్ పేషెంట్లు మామిడిపండు తినొచ్చా.. లేదా అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. కారణం మామిడి పండ్లు రుచికి తియ్యగా ఉండటమే.

న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారం.. 100 గ్రాముల మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అంటే ఈ పండ్లు తింటే రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది. అలాగని మరీ మడికట్టుకుని కోర్చోనవరసరం లేదని, మితంగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండ్లను మితంగా తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడికాయ ముక్కలు ఒకటి లేదా రెండు తినడం మంచిదేనని అంటున్నారు.ఐతే మామిడి పండ్లను తినే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. ఆ విధంగా తింటేనే మామిడిలో ఉండే ఫైబర్ చక్కెరను స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మామిడి పండ్లను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయన్నమాట. మామిడిలో అధికంగా పోషక విలువలు, తక్కువ గ్లైసెమిక్ స్థాయిలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను ఎలా తినాలంటే..

  • డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా పండిన మామిడితో పోలిస్తే పండని మామిడి కాయలు తినడం మంచిది. ఎందుకంటే పండని మామిడిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
  • మామిడితో పాటు పెరుగు, పనీర్ లేదా చేప వంటి ప్రోటీన్ ఆహారాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • మామిడిపండు జ్యూస్‌లో చక్కెర కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మామిడి కాయ జ్యూస్‌ తాగితే, అందులో చక్కెర కలపకూడదు.
  • మామిడికాయను తొక్కతోపాటు తినాలి.
  • ఉదయం పూట వాకింగ్‌ చేసిన తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినడానికి ఉత్తమ సమయంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఉదయం కాల వ్యాయామం తర్వాత మధ్యాహ్న భోజనం మధ్య తినాలన్నమాట. ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐతే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మాత్రం మామిడి పండ్లను తినేముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు తినడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..