Health Tips: ఇది మీకు తెలుసా..? జామ ఆకులతో టీ చేసుకుని తాగితే.. మధుమేహం పరారవుతుందట..!

అల్పాహారం కోసం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఫైబర్ తక్కువగా, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

Health Tips: ఇది మీకు తెలుసా..? జామ ఆకులతో టీ చేసుకుని తాగితే.. మధుమేహం పరారవుతుందట..!
Guava Leaves
Follow us

|

Updated on: Mar 06, 2024 | 12:26 PM

మధుమేహం భారతదేశంలో చాప కింద నీరులా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. వృద్ధుల్లోనే కాదు యువత, చిన్నారుల్లో కూడా మధుమేహం పెరుగుతోంది. దీనికి వైద్య చికిత్స ముఖ్యం. అయితే, డయాబెటిస్‌ను ఇంటి నివారణల సహాయంతో కూడా నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఇంటి నివారణలో అనేకం ఉన్నాయి. అందులో ఒకటి జామ ఆకులు కూడా ఉపయోగపడుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ ఆకులను తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తున్నారు. జామపండులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, మందులు, సరైన ఆహారంతో దీనిని నియంత్రించవచ్చు. జామ టీ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందుకోసం 8-10 జామ ఆకులను తీసుకుని కప్పు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని సగానికి తగ్గించే వరకు మరిగించి వడగట్టి వాడండి. జామ ఆకులోనూ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ టీ తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు. మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించలేని లేదా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి.

ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం శరీరంలోని ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. మధుమేహం ఉన్నవారు తక్కువ పిండిపదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. అల్పాహారం కోసం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు.

ఇవి కూడా చదవండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఫైబర్ తక్కువగా, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు