AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నెయ్యితో ఆటలు వద్దు.. వీళ్లకు విషమే..! ఎవరు తినకూడదో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ, అందరికీ సరిపడదు. బరువు తగ్గాలనుకునేవారు, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. అధిక నెయ్యి సేవనం వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, మొటిమలు వంటి దుష్ప్రభావాలు రావచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నెయ్యి తీసుకోవడం పరిమితం చేయాలి.

Health Tips: నెయ్యితో ఆటలు వద్దు.. వీళ్లకు విషమే..! ఎవరు తినకూడదో తెలుసా?
What If Rbi Prints Unlimited Notes (1)
Jyothi Gadda
|

Updated on: Dec 18, 2025 | 8:04 PM

Share

ఆయుర్వేదం ప్రకారం నెయ్యిని ఔషధ గుణాల నిధి అని అంటారు. చాలామంది పప్పు, కూరగాయలు, రోటీల వరకు చాలామంది నెయ్యి వేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నెయ్యి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ నెయ్యిని తీసుకోకూడదు. కొంతమందికి నెయ్యి హాని కలిగించవచ్చు. ఇప్పటికే కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నవారు నెయ్యి తినకుండా ఉండటం మంచిది. ఎవరు నెయ్యి తినకూడదో ఇక్కడ చూద్దాం..

నెయ్యి తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అధిక వినియోగం వల్ల అధిక కేలరీలు వస్తాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. నెయ్యిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. అధిక వినియోగం వల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. నెయ్యిని అస్సలు తీసుకోకండి. గుండె రోగులు కూడా ఎక్కువ మొత్తంలో నెయ్యి తీసుకోవడం మానుకోవాలి. గుండె ఆరోగ్యానికి ఆటంకం కలిగించే అనేక అంశాలు ఉన్నాయి.

కొంతమందికి నెయ్యి తినడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీకు అలాంటి సమస్య ఉంటే నెయ్యిని తీసుకోకండి. నెయ్యిలో సోడియం ఎక్కువగా ఉండదు. కానీ, ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉంటే, మీరు నెయ్యి తీసుకోవడం పరిమితం చేయాలి. నెయ్యి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు నెయ్యి తీసుకోవడం పరిమితం చేయాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..