AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ పిల్లలు ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే, డైట్‌లో వీటిని తప్పనిసరిగా చేర్చండి..

Board Exams: పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకుంటేనే వారు చక్కగా చదువుకోగలరు. లేదంటే..

Health Tips: మీ పిల్లలు ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే, డైట్‌లో వీటిని తప్పనిసరిగా చేర్చండి..
Board Exams
Venkata Chari
|

Updated on: Mar 21, 2022 | 9:05 PM

Share

పిల్లలు ఏడాది పొడవునా చదివినప్పటికీ, ఫైనల్ పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు వారు కొన్ని నెలల ముందు నుంచే కఠినమైన షెడ్యూల్‌తో పరీక్షకు సిద్ధమవుతుంటారు. పిల్లలు ఎక్కువ కాలం కష్టపడి చదవాలంటే మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం. పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పరీక్ష సమయంలో ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. నీరు మన శరీరంలో రసాయన ప్రతిచర్యను వేగవంతం చేస్తుంది. దీని వల్ల మన మెదడు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో, ఇది మన అలసటను తగ్గిస్తుంది. మనం విషయాలను మరచిపోతుంటే, సాధారణ సమయానికి నీటిని తీసుకుంటుండాలి. మంచి మానసిక ఆరోగ్యం కోసం రోజుకు 1.2 లీటర్ల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా, మీ టేబుల్‌పై వాటర్ బాటిల్ ఉంచుకోవడం మంచింది.

చదువుకునేటప్పుడు ఎప్పటికప్పుడూ తేలికగా ఉండే ఆహారాన్ని ఏదైనా తినండి. అది చాలా ఎనర్జీని కలిగి ఉంటుంది. అలాగే తాజా అనుభూతి చెందుతారు. జున్ను, వేరుశెనగ, రసం తాగాలి. డ్రై ఫ్రూట్స్, ఓట్స్ తినండి. ఇవన్నీ మీ శక్తి స్థాయిని పెంచుతాయి. మీ కడుపు నిండుగా ఉంచుతాయి. లేదా పచ్చి కూరగాయలు తినండి. బచ్చలికూర, బీన్స్‌లో మెగ్నీషియం, పొటాషియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇశి జ్ఞాపకశక్తిని పెంచడంలో అలాగే అభ్యాస సామర్థ్యాన్ని పెంచడంలో చాలా సహాయకారిగా పనిచేస్తాయి.

మీకు అలసట లేదా నిద్ర వచ్చినప్పుడు బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. అయితే, ఇది తక్షణ నివారణ. గ్రీన్ టీ ఎప్పుడూ దీని కంటే మెరుగ్గా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ ఏకాగ్రత అలాగే ఉంటుంది.

చదువు మధ్యలో విరామం తీసుకున్నప్పుడల్లా పండ్లను తప్పకుండా తినండి. నీరు సమృద్ధిగా ఉండే పండ్లను తీసుకుంటే, అది మీకు మంచిది. ఎందుకంటే మన మెదడులో 85 శాతం నీరు ఉంటుంది. నారింజ, ద్రాక్ష, దోసకాయలను తీసుకోవడం వల్ల మెదడు హైడ్రేట్‌గా ఉంటుంది.

పాలు తాగడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ, ఏడాది పొడవునా ప్రతిరోజూ నిద్రవేళలో పాలు తాగాలి. కానీ, మీరు అలా చేయకపోతే వెంటనే చేయడం ప్రారంభించండి. ఎందుకంటే, బోర్డ్ ఎగ్జామ్ దగ్గర పడ్డాయి. విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పాలలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పదునైన జ్ఞాపకశక్తి కోసం, బాదంపప్పును రాత్రి నానబెట్టి, ప్రతిరోజూ ఉదయం తినాలి. కావాలంటే బాదంపప్పుతో పాటు నానబెట్టిన అంజీరా పండ్లను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అంజీర పండ్ల వినియోగం అలసటను దూరం చేస్తుంది. అలాగే ఇది మనస్సును పదునుగా ఉంచుతుంది.

మీరు ఎక్కువసేపు చదువుకోవాలని అనుకుంటే మీ నిద్రతో ఎప్పుడూ రాజీపడకండి. ఎల్లప్పుడూ నిద్ర కోసం 7 గంటలు సమయం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా నిద్ర పోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు చదువుకున్న తర్వాత మెదడు అలసిపోతుంది. ఆ తర్వాత రీఛార్జ్ చేయడానికి చాలా మంచి, గాఢమైన నిద్ర అవసరం.

Also Read: Weight Loss: వేసవిలో డిటాక్స్ నీటిని ఒక సిప్ చేయండి చాలు.. సులభంగా బరువు తగ్గుతారు..

Diabetes Control Tips: వేసవిలో డయాబెటిస్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్ ఇదే.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..