AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin C: రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ C ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా ? అయితే మీరు డేంజర్‏లో ఉన్నట్లే.. నిపుణుల సూచనలు..

కరోనా రెండో దశ మరోసారి భారత్‏లో విలయాన్ని సృష్టించింది. ఈ మాహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ తోపాటు.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే.

Vitamin C: రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ C ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా ? అయితే మీరు డేంజర్‏లో ఉన్నట్లే.. నిపుణుల సూచనలు..
Vitamin C Food
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2021 | 8:53 AM

Share

కరోనా రెండో దశ మరోసారి భారత్‏లో విలయాన్ని సృష్టించింది. ఈ మాహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ తోపాటు.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఇందుకోసం చాలా మంది విటమిన్స్, ఖనిజాలు, పోషకాలు ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా విటమిన్ సీ అధికంగా ఉండే ఫుడ్ ఎక్కువగా తినేస్తున్నారు. అయితే విటమిన్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ మరీ ఎక్కువగా తీసుకున్న ప్రమాదమే అంటున్నారు నిపుణులు. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వలన మనం మరింత డేంజర్ లో పడ్డట్లే అంటున్నారు.

నిమ్మకాయ.. వంటి ఆమ్లాత్వం కలిగిన పండ్లలో విటిమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే చాలా వరకు విటమిన్ సీ టాబ్లెట్స్ వేసుకోవడం ప్రారంభించారు. అయితే ఇది మోతాదుకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమేనట. కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో.. చాలా వరకు విటమిన్ డి 3, కాల్షియం, జింక్, మల్టీ విటమిన్లు తీసుకుంటున్నారు. ఇవి కూడా మోతాదును మించి తీసుకోకుడదు.

ఆర్ఎంఎల్ హాస్పిటల్ వైద్యుడు రాజీవ్ సూద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యమే. కానీ.. జింక్, విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం హానికరం అన్నారు. విటమిన్ సీ 20వ శాతాబ్ధం ప్రారంబంలో ఆల్బర్ట్ స్టెంట్ జ్యోర్గి కనుగొన్నారు. విటమిన్ సీ లోపంతో ఉన్నవారికి స్కర్వి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా న్యూమోనియా వచ్చే అవకాశాలున్నాయి.

1970వ దశకంలో నోబెల్ గ్రహీత లినస్ పాలింగ్ జలుబు చికిత్సలో విటమిన్ సీ సప్లిమెంట్స్ వాడకాన్ని ప్రారంభించారు. విటమిన్ సీ లోపం ఉన్నవారు అత్యధికంగా ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది శరీరంలో నిల్వ ఉండదు. ప్రతిరోజూ ఈ విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దూమపానం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం.. తగినంత పోషకాలు తీసుకోకపోవడం వలన విటమిన్ సీ లోపం ఉంటుంది.

1950-1960లో ఓ ఆసుపత్రి వైద్యులు విటమిన్ సీ లోపం పై అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా.. రోజుకు 4 నుంచి 6 గ్రాముల విటమిన్ సి తీసుకోవాలని సూచించారు. ఇది జలుబు, ప్లూ లక్షణాలను 85 శాతం తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకునేవారు 20 నారింజలు.. 1 గ్రాము విటమిన్ సీ అందిస్తుంది.

ఇక కరోనా వైరస్ ఉపిరితిత్తులకు నష్టం చేయడానికి ప్రధాన కారణం.. అదనపు ప్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోవడం వలన ప్రభావం చూపిస్తుంది. విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్. ఇది ప్రీ రాడికల్స్ ను తటస్థం చేయడం ద్వారా ఉపరితిత్తులను దెబ్బతీస్తుంది. అలాగే ఆక్సిడెంట్లు, యాంటీ ఆక్సిడెంట్ల మధ్య సమతుల్యత లేనప్పుడు రోగులలో వ్యాధి ప్రభావం తీవ్రమవుతుంది. విటమిన్ సీ తగినంత తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్ స్థితిని పెంచుకోవచ్చు.

Also Read: Akhanda Movie: బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?

Vijay Sethupathi: త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ -3’ సిరీస్… కీలక పాత్రలో మక్కల్ సెల్వన్ ?

Follow Us