AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా..?

ఇది సరైన పద్ధతి కాదు. దీంతో సులభంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే, జీర్ణక్రియ సరిగ్గా ఉండేందుకు భోజనానికి 30 నిమిషాల ముందు ఓ గ్లాసు నీరు తాగాలి. భోజనానికి ముందు, తర్వాత తొందరగా నీళ్లు తాగొద్దు. ఎందుకంటే నీరు జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఆహారం తీసుకున్న ఓ గంట తర్వాత నీరు త్రాగితే శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

Weight Loss Tips: భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా..?
Water Drinking
Jyothi Gadda
|

Updated on: Feb 23, 2024 | 6:34 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ముఖ్యంగా కొంచెం అధిక బరువు ఉన్నవారికి ఇది మరింత సమస్య. కొంతమంది అనారోగ్యాలు, మందులు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా బరువు పెరుగుతారు. వారు తమ సమస్యలను పరిష్కరించకుండా బరువు తగ్గలేరు. శరీరంలో పెరిగిన కొవ్వు కారణంగా ఆరోగ్య సమస్యలు, వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇది చెప్పినంత సులభం కాదు. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం కూడా తప్పనిసరి. అయితే, కేవలం ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, నియంత్రించడం మాత్రమే కాకుండా ఆహారంలో అనేక విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారానే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

బరువు తగ్గడానికి భోజనానికి ముందు నీళ్లు తాగడం గురించి మీరు వినే ఉంటారు. భోజనానికి ముందు నీళ్లు తాగడం నిజంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందా? భోజనానికి ముందు నీళ్లు తాగితే మంచిది అనేవారు కొందరుంటే.. చెడు అనేవారూ కూడా ఉన్నారు. అయితే, బరువు తగ్గే విషయానికి వస్తే, భోజనానికి 20-30 నిమిషాల ముందు నీళ్లు తాగడం అనేది మంచి ఆలోచన.

భోజనానికి అరగంట ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని పొంది, తక్కువ తినడానికి సహాయపడుతుందని చెబుతారు. కొందరు ఫోర్క్‌తో ఆహారం తింటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీంతో సులభంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే, జీర్ణక్రియ సరిగ్గా ఉండేందుకు భోజనానికి 30 నిమిషాల ముందు ఓ గ్లాసు నీరు తాగాలి. భోజనానికి ముందు, తర్వాత తొందరగా నీళ్లు తాగొద్దు. ఎందుకంటే నీరు జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఆహారం తీసుకున్న ఓ గంట తర్వాత నీరు త్రాగితే శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక నివేదిక ప్రకారం, భోజనానికి ముందు ఒక పెద్ద గ్లాసు నీల్లు తాగే వ్యక్తులు తక్కువ ఆహారం తీసుకుంటారని, ఈ అలవాటును పాటించే వ్యక్తులు వారాల వ్యవధిలో శరీర బరువులో తేడాను చూశారని కనుగొన్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..