AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలంటే ఈ పిండి చపాతీ తినండి.. గోధుమలు కాదు!

చపాతీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగైతే బరువు తగ్గాలనుకునే వారు ఏ పిండి చపాతీ తినాలి. ఏ పిండి చపాతీ సులభంగా బరువు తగ్గుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Weight Loss Tips: బరువు తగ్గాలంటే ఈ పిండి చపాతీ తినండి.. గోధుమలు కాదు!
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2023 | 9:21 AM

Share

ప్రస్తుత జీవనశైలి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా అధిక ఉబకాయం, మధుమేహం వంటివి ప్రజల్ని వెంటాడుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒక రకంగా ఒత్తిడి, అధిక బరువే కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ భయాల కారణంగా చాలా వరకు ఎక్కువ మంది ముందుగానే బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను చూస్తారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి బదులు చపాతీ తినడం ప్రారంభిస్తారు. చపాతీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగైతే బరువు తగ్గాలనుకునే వారు ఏ పిండి చపాతీ తినాలి. ఏ పిండి చపాతీ సులభంగా బరువు తగ్గుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మిల్లెట్ పిండి: బియ్యం, మైదా, గోధుమలతో పోలిస్తే మిల్లెట్ బయటి చర్మంలో పాలీఫెనాల్స్ అధిక సాంద్రతలో కనిపిస్తాయి. రాగుల్లోని ప్రొటీన్‌ కంటెంట్‌ను బియ్యంతో పోల్చిచూస్తే, రాగుల్లోని ప్రొటీన్ కంటెంట్ బియ్యం కంటే రెండింతలు ఉంటుంది. మిల్లెట్ పిండిలో ఫైబర్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. రాగుల పిండిలో గ్లూటెన్ ఉండదు. ఊబకాయానికి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పిండి ఎంతో ఉపయోగపడుతుంది.

వోట్మీల్: ఓట్స్ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే ఓట్ మీల్ తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ఆహారంలో ఓట్స్‌ని చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

క్వినోవా పిండి: బియ్యం, గోధుమ పిండి వలె క్వినోవా పిండిని కూడా ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. క్వినోవా పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్వినోవా పిండిలో ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది అనారోగ్య కేలరీలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు