AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

Phani CH
|

Updated on: Feb 23, 2026 | 6:15 PM

Share

టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. మహేష్ బాబు మొదలుపెట్టిన మల్టీప్లెక్స్ ట్రెండ్‌ను అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ అనుసరిస్తున్నారు. వీరు సంపాదించిన ధనాన్ని తిరిగి ఇక్కడే పెట్టుబడిగా పెడుతూ, సినిమాతో పాటు బిజినెస్‌ను రెండు కళ్ళుగా చూస్తున్నారు. వారి ఈ డ్యూయల్ జర్నీ విజయవంతంగా కొనసాగుతోంది.

టాలీవుడ్‌లో ఇప్పుడు బిజినెస్ మెన్ హీరోల సంఖ్య గణనీయంగా పెరిగింది. సినీ రంగంలో దూకుడు చూపిస్తూనే, మన స్టార్లు వ్యాపారంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. వారందరికీ సినిమా, బిజినెస్ రెండూ రెండు కళ్ల లాంటివి. తమ సంపాదనను మళ్లీ ఇక్కడే పెట్టుబడిగా పెడుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ బిజినెస్ ఈ హీరోలకు ఆదరణ పొందిన రంగం. మహేష్ బాబు ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టగా, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి ఇతర స్టార్ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను బెంగళూరులో ప్రారంభించగా, అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఏఏఏ సినిమాస్‌ను స్థాపించారు. రవితేజ హైదరాబాద్‌లో ఏఆర్‌టీ సినిమాస్‌తో, విజయ్ దేవరకొండ తన స్వస్థలం మహబూబ్‌నగర్‌లో ఏవీడీ సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఈ హీరోలు తమ సినిమా షెడ్యూల్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?

11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..

నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్

నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల

అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..

Follow Us