AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Water Bath: ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఈ సమస్యలన్నీ పరార్..

ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మరీ ఎక్కువగా కాకుండా చాలా మితంగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఉప్పు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల మాత్రం చాలా లాభాలు ఉన్నాయి..

Salt Water Bath: ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఈ సమస్యలన్నీ పరార్..
Salt Water Bath
Chinni Enni
|

Updated on: Nov 21, 2024 | 4:11 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఎంతో ఫిట్‌గా ఉంటారు. అదే విధంగా శరీరంపై ఉండే మలినాలను కూడా తొలగించడం చాలా ముఖ్యం. శరీరంపై ఉండే బ్యాక్టీరియా, మలినాలు తొలగించడంలో నీళ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. శరీరం అంతా శుభ్ర పడుతుంది. ఫ్రెష్‌గా ఉంటారు.. ఒత్తిడి కూడా కంట్రోల్ అవుతుంది. అయితే నీటిలో రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేస్తే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పుతో కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు‌ను నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల.. శరీరంపై ఉండే మురికిని ఈజీగా వదిలిపోతుంది. అంతే కాకుండా రాళ్లు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీర నొప్పులు చాలా సులువుగా తగ్గుతాయి. మరి ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలను కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌ఫెక్షన్లు రావు:

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేవి త్వరగా తొలగి పోతాయి. సాధారణ నీటితో చేస్తే మురికి త్వరగా పోదు. ఉప్పు నీటితో స్నానం చేస్తే.. బ్యాక్టీరియా, వైరస్ వంటి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడతాయి. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మం అందంగా:

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి కూడా చాలా మంచిది. శరీరానికి మంచి మెరుపును కూడా ఇస్తుంది. ఇందుకు కారణం.. ఉప్పులో ఉండే మినరల్సే. చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ఉప్పు నీటితో స్నానం చేస్తే.. చాలా వరకు కంట్రోల్ అవుతాయి. దురద వంటివి కూడా రాకుండా ఉంటాయి. దుర్వాసన కూడా పోతుంది.

ఇవి కూడా చదవండి

ఒంటి, కీళ్ల నొప్పులు దూరం:

ఉప్పు కలిపి నీటితో స్నానం చేయడం వల్ల ఒంటి, కీళ్ల నొప్పుల నుంచి చాలా వరకు రిలీఫ్ పొందుతారు. శరీర నొప్పులతో బాధ పడేవారు ఉప్పు నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. అంతే కాకుండా కీళ్ల వద్ద రక్త ప్రసరణను తగ్గించడంలో కూడా ఈ నీరు సహాయ పడుతుంది. గోరు వెచ్చటి నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే.. శరీర నొప్పులు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి మాయం:

ఈ కాలంలో ఒత్తిడి, ఆందోళనలు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి. ఇంట్లోని, ఆఫీసులోని పరిస్థితుల కారణం, శరీరక శ్రమ కారణం వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు. అంతే కారకుండా అలసట, బద్ధకం, నిద్రలేమి సమస్యలు వెంటాడతాయి. ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఉప్పు నీరు చక్కగా పని చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.