AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఇలా తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గుతాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజూ ఉప్పునీరు తాగవచ్చు.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?
Drinking Salt Water
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2024 | 7:49 PM

Share

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బాడీలో టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగడం మంచిది. దీని వల్ల శరీరంలోని మురికి కూడా సులువుగా బయటకు వస్తుంది. అలాగే, ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఉదయాన్నే తాగే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపితే ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పరగడుపునే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి తాగటం వల్ల అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోరువెచ్చని నీటిని ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇది శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీకు మలబద్ధకం సమస్య ఉంటే, ఉప్పు నీరు ఔషధంగా పని చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు కదలికలు సులభతరం అవుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కడుపు pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపిన నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఉప్పునీరు తాగడం ద్వారా మీరు అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారించవచ్చు. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గుతాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజూ ఉప్పునీరు తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..