AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె లేని లోకంలో ఉండలేను.. ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..

ప్రేమంటే ఇదేనేమో.. ఎంతో గాఢంగా ప్రేమించిన తన ప్రియురాలు అనారోగ్యంతో చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ఆమె సమాధి దగ్గరకు వెళ్లి ఉరి

ఆమె లేని లోకంలో ఉండలేను.. ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..
Ravi Kiran
|

Updated on: Oct 25, 2020 | 4:24 PM

Share

Young Man Suicide: ప్రేమంటే ఇదేనేమో.. ఎంతో గాఢంగా ప్రేమించిన తన ప్రియురాలు అనారోగ్యంతో చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ఆమె సమాధి దగ్గరకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుడురుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆ గ్రామానికి చెందిన మహేష్, గీతాంజలి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఇప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలోపే విధి వీళ్ల జీవితాలతో ఆడుకుంది. ఆమె ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. ఈ నేపధ్యంలో మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవితం తనకొద్దని అనుకున్నాడు. ఇవాళ ఉదయం యువతి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె లేని లోకంలో తాను ఉండలేనంటూ ఆత్మహత్యకు ముందు మహేష్ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

కాగా, అతడి పెట్టిన స్టేటస్ చూసిన కొంతమంది స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునేసరికి.. మహేష్ అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకుని మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రేమించిన అమ్మాయి మృతిని తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మహేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.