Exit Poll Result 2021: బెంగాల్.. దంగల్.. మమతా వైపే మహిళలు, ముస్లింలు.. టీవీ9 ఎగ్జిట్ ఫలితాలు..

West Bengal Elections exit Poll Results 2021: దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్

Exit Poll Result 2021: బెంగాల్.. దంగల్.. మమతా వైపే మహిళలు, ముస్లింలు.. టీవీ9 ఎగ్జిట్ ఫలితాలు..
West Bengal, Assam Assembly Election Results 2021
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 29, 2021 | 7:41 PM

West Bengal Elections exit Poll Results 2021: దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంది. రెండు సార్లు వరుసగా అధికారాన్ని సొంతం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ మరోసారి పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందా..? లేక బీజేపీ గెలుస్తుందా.? అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. టీఎంసీ నుంచి అంతా తానై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి వరకు ఒంటరి పోరాటం చేశారు. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, రాష్ట్ర నేతలు ముందుండి నడిపించారు. దీంతోపాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి కూడా బరిలో ఉంది. అయితే.. టీవీ9 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. టీవీ9 సర్వేలో మళ్లీ దీదీ కే పట్టం కట్టేలా ఓటర్లు కనిపించారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి హేమాహేమీలు ప్రచారం నిర్వహించనప్పటికీ.. బెస్ట్ సీఎం మమతా బెనర్జీనే అంటూ చాలా మంది ఎన్నికలకు ముందే వెల్లడించడం విశేషం.

హేమాహేమీల లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా.. బెంగాల్ ప్రజలు మాత్రం మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే అధిక శాతంలో ఓటేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దీదీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చిందంటూ పేర్కొన్నారు. టీవీ9 ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక మంది అధికార తృణముల్‌కే జై కొట్టారు. వారిలో అత్యధికమంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. టీవీ9 నిర్వహించిన సీ ఓటర్ సర్వేలో 43.90 శాతం మంది టీఎంసీకి ఓటేశామని చెప్పగా.. బీజేపీ 40.50 శాతం, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమికి 10.70శాతం, ఇతరులు 4.90 శాతం అవకాశముందని చెప్పారు.

టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

టీఎంసీ: 142-152 బీజేపీ: 125-135 కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమి:+- 16-26

టీవీ9 నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. ఆ వివరాలు ఇలా..

మహిళలు బీజేపీ – 38.10% టీఎంసీ – 45.20% కాంగ్రెస్ – వామపక్షాలు -9.90% ఇతరులు- 6.80%

ముస్లింలు.. బీజేపీ – 14.00% టీఎంసీ – 70.00% కాంగ్రెస్ – వామపక్షాలు – 14.10% ఇతరులు- 1.90%

దీదీకి కలిసొచ్చిన అంశాలు..

➼ నందిగ్రామ్‌లో దీదీపై జరిగిన దాడి ఘటన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు. ఈ అంశం కూడా మహిళలపై అత్యధిక ప్రభావం చూపింది. ➼ తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి మహిళ పక్షాన ఉండటం, అత్యధిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అత్యధిక ప్రభావం చూపింది. ➼ దీంతోపాటు మహిళలనే ప్రచార అస్త్రంగా మార్చుకొని మమతా ఓట్లను మరల్చుకోవడం సఫలికృతం అయ్యారని తెలుస్తోంది. ➼ అంతేకాకుండా ముస్లింల ఓట్లను టీఎంసీ వైపు మరల్చుకోవడంలో మమతా కీలకంగా వ్యవహరించారు. ➼ ముఖ్యంగా ఎంఐఎం పార్టీని మొదట్లోనే చెక్ పెట్టారు. బీజేపీ నుంచి ఎంఐఎం డబ్బు తీసుకోని పోటీ చేయడానికి వస్తుందంటూ పలు ఆరోపణలు సైతం చేశారు. ➼ దీంతోపాటు పలువురు ఎంఐఎం కీలక నేతలను కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. తన ప్రసంగాలతో ముస్లింలను ఆకట్టుకునేలా చేశారు. ➼ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ఎనిమిది విడతల్లో ఎన్నికలను నిర్వహించడం కూడా దీదీకి కలిసి వచ్చింది. ➼ కరోనా సమయంలో కూడా ఎన్నికల సంఘం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదంటూ దీదీ చేసిన ప్రసంగాలు సక్సెస్ అయ్యాయని పేర్కొంటున్నారు. ➼ తానే బెంగాల్ టైగర్ అంటూ.. దీదీ స్థానికత విషయాలను ప్రచారస్త్రంగా మార్చుకున్నారు. ➼ ప్రతీ వేదికపై బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేయడం కూడా మమతా బెనర్జీకి కలిసివచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Exit Poll Result 2021 LIVE Streaming: నేటితో మినీ సంగ్రామానికి తెర.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్.. టీవీ9లో ఇలా వీక్షించండి

కరోనా అలర్ట్..! ఊపిరి సరిగ్గా తీసుకుంటున్నారా..! ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా..? లేదంటే ఇవి పాటించండి

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు