AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు బజార్లలో వినియెగదారులకు షాకింగ్ ట్రీట్మెంట్.!

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏ కూరగాయలు కొనాలన్నా 60 నుండి 70 రూ. పెట్టాల్సిందే. ఇక ఉల్లిపాయ అయితే నిన్నటి వరకు 80 రూపాయలు ధర పలికింది. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధర కొంతమేర తగ్గింది. అయితే బోర్డు మీద ఉన్న రేట్లు లోపల ఉండటం లేదు. రైతు బజార్లో కేజీ ఉల్లి 54 రూపాయలు బోర్డుపై ఉంటే లోపల మాత్రం 80 రూపాయలకు అమ్ముతున్నారు.. […]

రైతు బజార్లలో వినియెగదారులకు షాకింగ్ ట్రీట్మెంట్.!
Venkata Narayana
|

Updated on: Oct 22, 2020 | 2:51 PM

Share

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏ కూరగాయలు కొనాలన్నా 60 నుండి 70 రూ. పెట్టాల్సిందే. ఇక ఉల్లిపాయ అయితే నిన్నటి వరకు 80 రూపాయలు ధర పలికింది. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధర కొంతమేర తగ్గింది. అయితే బోర్డు మీద ఉన్న రేట్లు లోపల ఉండటం లేదు. రైతు బజార్లో కేజీ ఉల్లి 54 రూపాయలు బోర్డుపై ఉంటే లోపల మాత్రం 80 రూపాయలకు అమ్ముతున్నారు.. అదేంటి అని అడిగితే నిన్నటి వరకు ఇదే ధర ఉంది మేము ఈ ధరకే సరుకు తీసుకు వచ్చాము తక్కువకి ఎలా అమ్ముతామని అమ్మకందారులు చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఉల్లి కొనాలంటేనే కంట నీరు వస్తోంది.. బోర్డు మీద ఉన్న రేట్లు ఏవి కూడా లోపల ఉండటం లేదు.. ఇటు కూరగాయల పరిస్థితి కూడా అంతే.. ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అని అంటున్నారని పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.