దేశంలో తగ్గుతున్న ఫాట‌లిటీ రేటు

దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివిటి శాతం చాలా తక్కువగా ఉంటుంది.

దేశంలో తగ్గుతున్న ఫాట‌లిటీ రేటు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 2:41 PM

దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివిటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్ర‌స్తుతం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1 శాతం కంటే త‌క్కువ కేసులో ఫాట‌లిటీ రేటును న‌మోదు చేస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారు 67,95,103 మంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక్క రోజులో గ‌రిష్ఠంగా ఉండ‌డంతో జాతీయ రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతోంది. ఇది దాదాపుగా 89శాతానికి చేరువ‌కు వ‌చ్చింది. ఇక కొత్త కేసుల‌లో 77 శాతం కేసులు 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలలో మాత్రమే నమోదవుతున్నాయి.

కొత్త‌గా కోలుకున్న వారి సంఖ్య‌లో మ‌హారాష్ట్ర‌ను క‌ర్ణాట‌క దాటిపోయింది. క‌ర్ణాట‌క‌లో 8500మంది కొత్త‌గా కోలుకున్నారు.మ‌హారాష్ట్ర‌,కేర‌ళ రాష్ట్రాల నుంచి కొత్త గా కోలుకున్న‌వారు 7,000 పైగా ఉన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని కరోనావైరస్ అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనూ పాజిటివిటీ రేట్లు వరుసగా 15%, 10%, 9% శాతంగా నమోదైయ్యాయి. అయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ పరీక్షను తగ్గించాయి. 14 రోజుల వ్యవధిలో మహారాష్ట్ర మొత్తం పరీక్ష అక్టోబర్ 5-18లో 9.7 లక్షలకు పడిపోయింది. అంతకుముందు పక్షం రోజులలో సెప్టెంబర్ 22-అక్టోబర్ 5 వరకు 11.52 లక్షల కేసులు వెలుగుచూశాయి.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అన్ని రాష్ట్రాలలో అత్యధిక పాజిటివిటీ రేటుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత రాష్ట్రాల్లో యుపి, బీహార్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ టాప్ 10లో నిలిచాయి. అక్టోబర్ 18 తో ముగిసిన పక్షం రోజుల్లో రాజస్థాన్ కూడా పాజిటివిటీ రేటులో 10% వద్ద రెండంకెలకు చేరుకుంది.

కానీ, మహారాష్ట్రలో సెప్టెంబర్ 22-అక్టోబర్ 5 సమయంలో 3.15 లక్షల పరీక్షల నుండి అక్టోబర్ 5-18 మధ్య 2.71 లక్షల వరకు తగ్గించింది. పశ్చిమ బెంగాల్, 9% పాజిటివిటీ రేటుతో, సంపూర్ణ పరీక్ష సంఖ్యలో తగ్గుదల నమోదైంది. ఇక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సానుకూలత రేట్లు 6% అంతకంటే ఎక్కువ నమోదు అయ్యాయి. వీటిని బట్టి చూస్తూ క్రమంగా కరోనా పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.

బుధవారం నాటికి ఇప్పటికే 9.72 కోట్ల పరీక్షలు నిర్వహించిన భారత్ 10 కోట్ల కరోనా పరీక్షల మార్కుకు చేరుకుంది. 12.7 కోట్లతో యుఎస్ మాత్రమే ఎక్కువ పరీక్షలు నిర్వహించిన దేశంలో నిలిచింది. ప్రతి పది లక్షలకు 2 లక్షల నమూనాలను పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ 1.37 లక్షలతో అత్యధిక స్థానంలో నిలవగా, తమిళనాడు 1.2 లక్షలు, కేరళ 1.14 లక్షలు, కర్ణాటక 1 లక్షలు, బీహార్ 78,563, మహారాష్ట్ర 67,500, యుపి 59,764, రాజస్థాన్ 45,611, పశ్చిమ బెంగాల్ 42,088 పరీక్షలు నిర్వహించాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో