ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలో ప్రచారంలో భాగంగా ఏర్పడిన వెన్నునొప్పి, భుజాల కండరాల సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆయనకు తక్షణ శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు. అయితే, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా శస్త్రచికిత్సను వాయిదా వేసిన పవన్, త్వరలోనే ఆపరేషన్ చేయించుకోనున్నారు.