వెంకయ్య సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితిలోని యూనివర్శిటీ ఆఫ్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది. కోస్టారికా రాజధాని శాన్జోస్లో శుక్రవారం యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా వెంకయ్య ఈ డాక్టరేట్ను అందుకున్నారు. చట్టబద్దపాలన, ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయాల్లో ఆయన చేసిన కృషికిగానూ ఈ డాక్టరేట్ను ఐక్యరాజ్య సమితి ఆయనకు అందించింది. ప్రపంచంలోని అతి కొద్ది మందికి మాత్రమే ఈ వర్సిటీ డాక్టరేట్ అందించగా అందులో వెంకయ్య ఒకరు. […]
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితిలోని యూనివర్శిటీ ఆఫ్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది. కోస్టారికా రాజధాని శాన్జోస్లో శుక్రవారం యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా వెంకయ్య ఈ డాక్టరేట్ను అందుకున్నారు. చట్టబద్దపాలన, ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయాల్లో ఆయన చేసిన కృషికిగానూ ఈ డాక్టరేట్ను ఐక్యరాజ్య సమితి ఆయనకు అందించింది.
ప్రపంచంలోని అతి కొద్ది మందికి మాత్రమే ఈ వర్సిటీ డాక్టరేట్ అందించగా అందులో వెంకయ్య ఒకరు. భారత్ నుంచి తొలివాడు వెంకయ్య నాయుడే. ఈ సందర్భంగా ఉప ఆయన మాట్లాడుతూ.. శాంతి భావానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపే ఈ డాక్టరేట్ అని అన్నారు.