AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్కర్‌కు కావాలంటే.. మాస్క్‌తో పాటు గొడుగు తప్పనిసరి..

Liquor: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లిక్కర్ షాప్‌లు తెరచుకోవడంలో మద్యం బాబుల సంబరం అంతా ఇంతా కాదు. షాపులు తెరవక ముందే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు. కాగా.. […]

లిక్కర్‌కు కావాలంటే.. మాస్క్‌తో పాటు గొడుగు తప్పనిసరి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2020 | 4:37 PM

Share

Liquor: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లిక్కర్ షాప్‌లు తెరచుకోవడంలో మద్యం బాబుల సంబరం అంతా ఇంతా కాదు. షాపులు తెరవక ముందే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు.

కాగా.. ఈ క్రమంలో ఏపీ అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడుగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలో గొడుగు నిబంధన పెట్టారు. అక్కడ అది వర్కవుట్ అయ్యి.. అందరూ సామాజిక దూరం పాటించారు. ఈ నేపథ్యంలో అంతటా గొడుగును తప్పనిసరి చేశారు.

Also Read: రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..