వైభవంగా కనకదుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారికి మందార, ఎర్ర కలువలు, చామంతి పూలతో అత్యంత శోభాయమానంగా పుష్పార్చన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్వయంగా పూజలు చేయగా, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజూ విభిన్న పుష్పాలతో అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నాయి, ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
