భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని అందుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధిపతిగా దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 8,931 రోజుల పాటు పదవిలో కొనసాగిన మోదీ, పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు.