కేజీ టమాటా ధర రూ. 300లు..ఎక్కడంటే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు..కోయ కుండానే వినియోగదారులకు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం టమాట ఠారెత్తిస్తోంది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 300లకు చేరటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న దేశాధ్యక్షులు సైతం టమాటా ధరలపై సమీక్షలు నిర్వహిస్తున్నారట. ప్రజలకు అందుబాటులో “సస్తా బజార్‌’ ఏర్పాటు చేసి తక్కువ ధరలకే సరుకులు, కూరగాయలు అందజేయాలని యోచిస్తున్నారట. ఇదంతా ఎక్కడో కాదు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ […]

కేజీ టమాటా ధర రూ. 300లు..ఎక్కడంటే..!
Follow us

|

Updated on: Dec 06, 2019 | 7:00 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు..కోయ కుండానే వినియోగదారులకు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం టమాట ఠారెత్తిస్తోంది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 300లకు చేరటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న దేశాధ్యక్షులు సైతం టమాటా ధరలపై సమీక్షలు నిర్వహిస్తున్నారట. ప్రజలకు అందుబాటులో “సస్తా బజార్‌’ ఏర్పాటు చేసి తక్కువ ధరలకే సరుకులు, కూరగాయలు అందజేయాలని యోచిస్తున్నారట. ఇదంతా ఎక్కడో కాదు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ అక్కడ టమాటా ధరలు ఎందుకు అంతగా మండిపోతున్నాయన్నది  పరిశీలించినట్లయితే..అందుకు కారణం భారత్‌తో పాక్‌ తెంచుకున్న మైత్రీగానే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్‌, భారత్‌తో వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం విధితమే.. దీంతో భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే టమాటా ధరలు ఆకాశానికి చేరాయంటూ ఏకంగా ఆ దేశ ఆర్థిక వ్యవహారాల మంత్రి మీడియాకు వెల్లడించినట్లుగా డాన్‌ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో నిలిచిపోయిన వ్యాపార లావాదేవీల కారణంగానే పాక్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని సదరు మంత్రి వివరించినట్లుగా డాన్‌ పత్రికలో పెర్కొంది. ప్రజలపై టమాటా భారం పడకుండా ఉండేందుకు త్వరలోనే సస్తాబజార్లు ఏర్పాటు చేయనున్నట్లుగా స్పస్టం చేశారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?