AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం బ్రేక్ దర్శనాలు రద్దు

జూలై 11వ తేదీ మంగళవారం మలయప్ప స్వామీ ఆలయానికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కనుక రేపు ఎటువంటి  సిఫారసు లేఖలు స్వీకరించమని.. ఇది గమనించి భక్తులు తిరుమల క్షేత్రానికి ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా టీటీడీ కోరారు. 

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం బ్రేక్ దర్శనాలు రద్దు
ఉత్తర భారతదేశంలోని ఏ దేవాలయంలోనైనా ఇలాంటి డ్రెస్ కోడ్ అమలులోకి రావడం ఇదే తొలిసారి కాగా, దక్షిణాదిలోని పలు దేవాలయాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. మరి ఆ దేవాలయాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Surya Kala
|

Updated on: Jul 09, 2023 | 2:02 PM

Share

శ్రీవారి భక్తులకు అలెర్ట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. మరోవైపు ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించారు. శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11వ తేదీ మంగళవారం మలయప్ప స్వామీ ఆలయానికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కనుక రేపు ఎటువంటి  సిఫారసు లేఖలు స్వీకరించమని.. ఇది గమనించి భక్తులు తిరుమల క్షేత్రానికి ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా టీటీడీ కోరారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయం ప్రాంగణం, వస్తువులు, పూజా సామాగ్రి, గోడలు, పూజా సామాగ్రి సహా శ్రీవారి ఆలయాలలోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా శాస్త్రోక్తంగా శుద్ధి చేస్తారు.    ఆలయ శుద్ధి కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, టీటీడీ సిబ్బంది పాల్గొంటారు.

మరోవైపు తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆలయంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. స్వామివారి దర్శనం కోసం  శిలా తోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు ఎదురుచూస్తున్నారు. శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీ కానుకలు విలువ  రూ.3.47 కోట్లని టీటీడీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..