దోచుకోడానికి అంబులెన్స్​లో, తస్మాత్ జాగ్రత్త

దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడి చేయడానికి క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. పోలీసులకు సరికొత్త ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా  దొంగతనం కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది ఓ గ్యాంగ్.

దోచుకోడానికి అంబులెన్స్​లో, తస్మాత్ జాగ్రత్త
Follow us

|

Updated on: Oct 23, 2020 | 8:33 PM

దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడి చేయడానికి క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. పోలీసులకు సరికొత్త ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా  దొంగతనం కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది ఓ గ్యాంగ్. అంబులెన్స్​లో వచ్చి చోరీకి యత్నించింది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులోని జయనగర్​ ఏరియాలో  జరిగింది.

ఈనెల 1న అంబులెన్స్​లో వచ్చిన ముగ్గురు దుండగులు ఉపకార్​ డెవలపర్స్​ కంపెనీలోకి చొరబడ్డారు. డోర్స్ పగలకొట్టి లోపలకు ప్రవేశించారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాటికి రంగు పూశారు. అయితే, ఆ కంపెనీలో డబ్బు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఇలా అంబులెన్స్​లో వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధాపుర పోలీసులు.. కేసు నమోదు చేసుకుని… నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !

Latest Articles