AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాజ్‌ సందర్శకుల కోసం.. ఎప్పుడు తెరుచుకోనుందంటే..!

అన్‌లాక్‌ 4 ప్రక్రియలో భాగంగా దేశంలోని అన్ని వ్యవస్థలు గాడిలో పడ్డాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో టూరిస్టు సెంటర్లకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు. 

తాజ్‌ సందర్శకుల కోసం.. ఎప్పుడు తెరుచుకోనుందంటే..!
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2020 | 10:31 AM

Share

అన్‌లాక్‌ 4 ప్రక్రియలో భాగంగా దేశంలోని అన్ని వ్యవస్థలు గాడిలో పడ్డాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో టూరిస్టు సెంటర్లకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు.

టూరిస్టుల అనుమతి కోసం ఏఎస్‌ఐ సూపరింటెండింగ్‌ పురావస్తు శాస్త్రవేత్త బసంత్‌కుమార్‌ తెలిపారు. రెండు ప్రాంతాల్లో ఒకే రోజు వరుసగా ఐదువేలు, 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా టికెట్‌ కౌంటర్లు తెరువడం లేదన్నారు. సందర్శకులకు ఎలక్ట్రానిక్‌ టికెట్లు జారీ చేస్తామన్నారు. పర్యాటకులంతా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు.

మాస్క్‌లు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో మార్చిలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడ్డ తాజ్‌మహల్‌, ఆగ్రా పోర్ట్‌ దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతి ఇస్తున్నారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం 61,625 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్‌ ప్రభావంతో 3,920 మంది మృత్యువాతపడ్డారు.