AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకున్న బాలు పార్థీవదేహం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థీవదేహం చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకుంది. బాలు అభిమానులు భారీఎత్తున కొడంబాకంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.

చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకున్న బాలు పార్థీవదేహం
Balaraju Goud
|

Updated on: Sep 25, 2020 | 4:35 PM

Share

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థీవదేహం చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకుంది. బాలు అభిమానులు భారీఎత్తున కొడంబాకంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. అభిమానులు ఎవరూ రావొద్దని ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాలు భౌతికకాయం వెంబడి ఆయన కొడుకు శరన్ మాత్రమే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే కొడంబాకంకి చేరుకుంటున్నారు. కాగా, రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగే అవకాశం ఉంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో తిరువళ్లూరు జిల్లా కామరైపాకంలో ఆయన ఫామ్ హౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు చైన్నై నుంచి ఊరేగింపుగా ఆయన పార్థీవదేహాన్ని తరలిస్తారా? కొవిడ్‌ ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి ఆర్బాటాలు లేకుండా తీసుకెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కుటుంబసభ్యులు, సన్నిహితులు, కొందరు ప్రముఖుల సమక్షంలోనే అంత్యక్రియలు జరిగే చాన్స్‌ ఉందని కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు.