AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాఘట్ బంధన్‌తోనే బీహార్ ప్రజలుః సోనియా

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.

మహాఘట్ బంధన్‌తోనే బీహార్ ప్రజలుః సోనియా
Balaraju Goud
|

Updated on: Oct 27, 2020 | 2:54 PM

Share

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం నితీశ్ సర్కార్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం, అహంతో నితీశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి పక్కకు తప్పిపోయిందని సోనియా గాంధీ విమర్శించారు. బిహార్ ప్రజలు మహాఘట్ బంధన్‌తోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాలనలో కార్మికులు నిస్సహాయులయ్యారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యువత నిరుద్యోగంతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు మహాఘట్ బంధన్ తో ఉన్నారని సోనియా గాంధీ వెల్లడించారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగులేదన్న సోనియా.. దాని ప్రభావం పేద ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు. బీహార్ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మహా దళితుల పరిస్థితి రాష్ట్రంలో చాలా దయనీయంగా ఉందని, వారందరికీ విముక్తి కలిగించేందుకు మహాఘట్ బంధన్‌తోనే ఉన్నారని సోనియా తెలిపారు. ఢిల్లీ, బిహార్ ప్రభుత్వాలు బంధనంలో ఉన్న ప్రభుత్వాలని, నోట్లరద్దు, లాకౌట్, నిరుద్యోగం లాంటి బంధనాల్లో ఆ ప్రభుత్వాలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆమె విమర్శించారు. బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు కూడా దగ్గర్లోనే ఉందన్నారు. ప్రజల చేతిలో అయుధమైన ఓటును కాంగ్రెస్ కూటమికి వేసి నితీష్ పాలన నుంచి విముక్తి కావాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.