వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న సాయిధరమ్ తేజ్.. వచ్చే ఏడాది రెండు సినిమాలతో వస్తానంటున్న మెగా మేనల్లుడు..

మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్న సమయంలో చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న సాయిధరమ్ తేజ్.. వచ్చే ఏడాది రెండు సినిమాలతో వస్తానంటున్న మెగా మేనల్లుడు..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 4:10 AM

మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్న సమయంలో చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే సినిమా చేసాడు తేజ్. త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు దర్శకుడు తెరెక్కిస్తున్న ఈ సినిమాలో అందాల భామ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాతోపాటు  బీవీఎస్ఎన్ ప్రసాద్.. సుకుమార్ లు కలిసి నిర్మించబోతున్న పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ దన్ను దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే రెండు సినిమాలను విడుదల చేయాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.