AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?

ఐపీఎల్ 2020 ఇలా ముగిసిందో లేదో.. అప్పుడే వచ్చే ఏడాది ఐపీఎల్ సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియా వేదికగా....

ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?
Ravi Kiran
|

Updated on: Nov 20, 2020 | 2:55 PM

Share

Royal Challengers Bangalore: ఐపీఎల్ 2020 ఇలా ముగిసిందో లేదో.. అప్పుడే వచ్చే ఏడాది ఐపీఎల్ సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియా వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. మార్చి-మే మధ్య ఈ మెగా టోర్నమెంట్ ఉండనుండగా.. జనవరి చివరి వారం దీనికి సంబంధించిన ఆక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రతీ ఫ్రాంచైజీ ముగ్గురు కీలక ఆటగాళ్లను అట్టే పెట్టుకుని మిగిలిన వారిని ఆక్షన్‌లో ఉంచుతారని ఓ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు స్టార్ ప్లేయర్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అందులో అద్భుతమైన బ్యాట్స్‌మెన్లతో పాటు మేటి బౌలర్లు కూడా ఉన్నారు.

ఈ ఏడాది ఆర్సీబీకి పడిక్కల్‌ ఓపెనర్‌గా పరుగుల వరద పారించాడు. అయితే మరో ఓపెనర్ ఫించ్ పెద్దగా రాణించకపోవడంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్‌ను తీసుకోవాలని బెంగళూరు యాజమాన్యం భావిస్తోందట. అలాగే మిడిల్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసేందుకు సన్‌రైజర్స్ ప్లేయర్స్ మనీష్ పాండే, షకిబుల్ హసన్‌ను ఆక్షన్‌లోకి వస్తే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారట. వీళ్లు మాత్రమే కాదు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా, క్రిస్ లిన్, ఇషాన్ కిషాన్, కార్లస్ బ్రాట్‌వైట్, లియాం ప్లంకట్ లాంటి స్టార్ ప్లేయర్స్‌ బిడ్డింగ్‌లో వస్తే కొనుగోలు చేసుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..