రైళ్లు,స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం నేరం.. భారీ జరిమానా..!
రైల్వేశాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం చేస్తే నేరంగా పరిగణించి వెంటనే జరిమానా లేదా జైలు శిక్ష విధించనుంది.

రైల్వేశాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం చేస్తే నేరంగా పరిగణించి వెంటనే జరిమానా లేదా జైలు శిక్ష విధించనుంది. రైల్వే చట్టం, 1989 ప్రకారం శిక్షలను హేతుబద్ధీకరించడానికి.. రైళ్లలో లేదా స్టేషన్లలో యాచనను నివారించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 144 (2) ప్రకారం ఇకపై రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేస్తే జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా విధించనున్నారు. అటు ధూమపానం కోసం, చట్టంలోని సెక్షన్ 167ను సవరించాలని కోరింది. తోటి ప్రయాణీకుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే, రైలు కంపార్ట్మెంట్లలో ఏ వ్యక్తి కూడా పొగ త్రాగకూడదు. రైళ్లలో పొగ తాగితే రూ. 100 వరకు జరిమానా విధిస్తారు. (Begging on Trains, Penalise Smokers Only with a Fine)
Also Read: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…




