AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా 6వ రోజూ పెరిగిన ‘పెట్రో’ ధరలు

ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రభావం భారత్ పైనా పడింది. వరుసగా ఆరో రోజూ కూడా పెట్రోలు ధరలు పెరిగాయి. మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసలు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ముంబైలో అత్యధికంగా పెట్రోలు ధర రూ. 76.64కు చేరగా, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 71ని దాటింది. మెట్రో నగరాల్లో కోల్ కతాలో పెట్రోలు […]

వరుసగా 6వ రోజూ పెరిగిన 'పెట్రో' ధరలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:26 PM

Share

ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రభావం భారత్ పైనా పడింది. వరుసగా ఆరో రోజూ కూడా పెట్రోలు ధరలు పెరిగాయి. మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసలు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ముంబైలో అత్యధికంగా పెట్రోలు ధర రూ. 76.64కు చేరగా, ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 71ని దాటింది. మెట్రో నగరాల్లో కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 73.11కు డీజిల్‌ రూ. 67.95కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 73.72కు, డీజిల్‌ ధర రూ. 69.91కు చేరింది. హైదరాబాద్‌ లో పెట్రోలు ధర రూ. 75.34కు, డీజిల్‌ ధర రూ. 71.95కు చేరుకోగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్‌ ధర రూ.71.33గా ఉంది.