Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!

Omicron Tension: ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది...

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 06, 2021 | 6:36 AM

Omicron Tension: ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 41 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క దక్షిణాఫ్రికాలో 217మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారు. దీంతో మళ్లీ ఏడాదిన్నర కిందటి పరిస్థితులు తలెత్తుతాయా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.

దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పాకిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్‌, వాషింగ్టన్‌ కూడా చేరాయి. ఇప్పటికే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌, మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ సెంటర్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండింతలకు పెరగింది. మరోవైపు డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. ఎమర్జెన్సీ కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు.

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌..

ఇటు భారత్‌లోనూ ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది న్యూ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్‌ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు.. ఢిల్లీలో ఇంకో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్‌ సోకింది. దీంతో దేశంలో 3 రోజుల్లోనే 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగానే దేశమంతా అలెర్ట్ అయింది. కానీ ఇప్పుడు మరో మూడు కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.

జింబాబ్వే నుంచి గుజరాత్‌కు..

జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్‌ లోని జామ్‌నగర్‌కు వచ్చిన 72 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి జామ్‌నగర్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపించారు. ఆ పరీక్షల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. అతను వ్యాక్సిన్ తీసుకోలేదని తేలింది.

విదేశాల నుంచి ముంబైకి వచ్చిన వారిలో 13 మందికి..

విదేశాల నుంచి ముంబైకి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్ తేలింది. తమిళనాడు వచ్చిన ఐదుగురికి చేసిన టెస్టుల్లోనూ కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు.. విదేశాల నుంచి ఇండియాలోని మిగతా నగరాలకు వచ్చిన వారిలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎంత మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో.. ఎంత మందికి నాన్ ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనేది తేలాల్చి ఉంది. వారందరికీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయితే దేశంలో ఈ కొత్త వేరియంట్ జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తుందనే ఆందోళనలు వ్యాక్తమవుతున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు..

ఇప్పటికే ఒమిక్రాన్‌తోనే టెన్షన్‌ పడుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజే 2,796 మరణాలు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎంత మందిని చంపుతుందోననే భయం వెంటాడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గడిచిన ఐదు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో డిసెంబర్‌ 1న 184 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. డిసెంబర్ 2న 189 కేసులు.. డిసెంబర్‌ 3న 198 కేసులు వచ్చాయి. కానీ డిసెంబర్ 4న 213 మందికి కరోనా సోకింది. అటు ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.

మనుషులను రాక్షసులుగా మారుస్తున్ ఒమిక్రాన్‌ భయం..

మరోవైపు ఒమిక్రాన్‌ భయం మనుషులను రాక్షసులుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో సైకోగా మారిన డాక్టర్‌ తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఒమిక్రాన్ వేరియంట్ అంద‌రినీ చంపేస్తుంది. శవాలను లెక్కించడం నా వల్ల కావడం లేదు.. అని డైరీలో రాసిన డాక్టర్ సుశీల్‌ కుమార్‌ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తరువాత పారిపోయాడు.

తాను డిప్రెషన్‌లో ఉన్నట్టు సోదరుడు సునీల్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ కూడా పెట్టాడు డాక్టర్‌ సుశీల్‌కుమార్. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగాదిప‌తిగా ప‌నిచేస్తున్న సుశీల్.. నిరంతరం ఒమిక్రాన్‌ .. కరోనా గురించి ఆలోచించి .. ఆలోచించి పిచ్చోడిగా మారిపోయాడు. ఉన్మాదంతో తన కుటుంబాన్ని హత్య చేశాడు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక తెలంగాణ, ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Omicron: భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి.. ఎలాంటి లక్షణాలు..!

Omicron Terror: ఒమిక్రాన్ భయం.. అమెరికా ప్రయాణాలకు ఇది తప్పనిసరి.. నిబంధనలు కఠినం చేసిన యూఎస్

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.