సీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ..ఆ నిర్ణయం సరికాదని వినతి
ఏపీ సీఎం జగన్కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది.
ఏపీ సీఎం జగన్కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు సీఎంకి లేఖ రాశారు. రెండు వరుసల రోడ్లపై టోల్ వసూల వల్ల ప్రజలు, రైతులు, రవాణా రంగంపై పెనుభారం పడుతుందని సీఎం దృష్టికి తెచ్చారు. గత రెండేళ్లుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని…ఇటీవల లాక్డౌన్, కరోనా పరిస్థితుల వల్ల రవాణా రంగం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని లేఖలో పేర్కొన్నాారు. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే లీటర్ డీజిల్పై 1.22 రూపాయల చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తోందని, ఇప్పుడు మళ్లీ రోడ్లపై టోల్ వసూలు చేస్తే భారం అధికం అవుతుందని వివరించారు.
2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ అభ్యర్థన మేరకు బ్రిడ్జిలపై టోల్ టాక్స్ రద్దు చేశారని….ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై టోల్ విధించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు ఆలోచన విరమించుకోవాలని లారీ యజమానుల సంఘం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.
Also Read :
వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు
పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..