AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారస్వామిలో మళ్లీ అదే ఆవేదన

కర్ణాటక సీఎం కుమారస్వామి మళ్లీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చన్నపట్నలో జరిగిన ఒక సమావేశంలో ఆయన తన బాధను బయటపెట్టారు. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఇప్పటికీ తన పార్టీ జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూనే  ఉందన్నారు. తన పార్టీ  శాసనసభ్యుడికి రూ.10 కోట్లు ఆఫర్ చేసి పార్టీ మారి బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు . ఎవరు ఎలాంటి […]

కుమారస్వామిలో మళ్లీ అదే ఆవేదన
Anil kumar poka
| Edited By: Nikhil|

Updated on: Jun 19, 2019 | 8:22 PM

Share

కర్ణాటక సీఎం కుమారస్వామి మళ్లీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చన్నపట్నలో జరిగిన ఒక సమావేశంలో ఆయన తన బాధను బయటపెట్టారు. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఇప్పటికీ తన పార్టీ జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూనే  ఉందన్నారు. తన పార్టీ  శాసనసభ్యుడికి రూ.10 కోట్లు ఆఫర్ చేసి పార్టీ మారి బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు . ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా భగవంతుని దయతో తన ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు స్వామి.

‘ నా గుండెల్లో ఉన్న బాధ మాటల్లో చెప్పలేను, బయటి ప్రపంచానికి నేను ముఖ్యమంత్రినే  కానీ ప్రతిరోజు బాధతోనే బతుకుతున్నాను. నా ఆవేదన వెనుక ఉండే కారణాలను నేను ఎవ్వరికీ చెప్పుకోలేను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను బాధ్యుణ్ని. ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు. ప్రభుత్వం  సజావుగా నడవాలి. అధికారుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి. నాకు కొన్ని బాధ్యతలున్నాయి వాటిని నిర్వర్తించక తప్పదు’ అంటూ  తన మనసులో బాధను వెల్లడించారు.  గతంలో కూడా ఇలాగే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో పార్టీ సభ్యుల్ని చూసి కన్నీళ్లు కూడ పెట్టుకున్నారు స్వామి.   గొంతులో గరళం  దాచుకున్న శివుడిలా తన పరిస్థితి ఉందంటూ  వ్యాఖ్యానించారు.