ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలిక కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన యువకుడిని హైదరాబాద్ నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన యువకుడిని హైదరాబాద్ నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం పరిధిలోని కాలనీకి చెందిన బాలిక(16)కు ఇన్స్టాగ్రామ్లో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన మధు (25) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మధు చెప్పడంతో ఆ బాలిక నమ్మింది. పది రోజుల క్రితం అతడు హైదరాబాద్ చేరుకుని బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి బళ్లారికి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోను లొకేషన్ ఆధారంగా బళ్లారిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో మధును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.