AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కొత్తగా 45,209 కరోనా కేసులు, పెరుగుతోన్న రికవరీ రేటు, ఢిల్లీలో మాత్రం..!

దేశంలో కొవిడ్​ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 10,75,326 శాంపిల్స్ టెస్ట్ చేయగా..  45,209 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

దేశంలో కొత్తగా 45,209 కరోనా కేసులు, పెరుగుతోన్న రికవరీ రేటు, ఢిల్లీలో మాత్రం..!
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2020 | 10:31 AM

Share

దేశంలో కొవిడ్​ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 10,75,326 శాంపిల్స్ టెస్ట్ చేయగా..  45,209 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మరో 501 మంది వైరస్ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో 85,21,617 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 4,40,962 మంది వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కి చేరింది.

ప్రస్తుతం డెత్ రేటు 1.46 శాతంగా ఉంది. యాక్టీవ్ కేసుల సంఖ్య 4.85 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 93.69శాతానికి పెరిగింది.  ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో 17.74 లక్షల కేసులతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేసులో ఉంది. నిన్న ఒక్కరోజే అక్కడ 5,760 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ఏపీ‌, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీలో కొత్తగా 5,879 కేసులు వెలుగుచూశాయి. తాజాగా మరో 100 మంది మరణించారు.