AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోర్బ్స్ 30లో చోటు దక్కించుకున్న హైదరాబాదీలు.. కేటీఆర్ ప్రశంసలు..

Forbes 30 Under 30 Asia: ప్రస్తుతం యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. ఇలాంటి వేళ ఓ ఆసక్తికరమైన వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ఫోర్బ్స్ 30 తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మన తెలుగు తేజాలు ఆరుగురికి చోటు దక్కడం విశేషం. 30 అండర్ 30 ఆసియా పేరుతో విడుదలైన ఈ జాబితాలో పది విభాగాలకు గానూ మొత్తం 300 మందిని ఎంపిక […]

ఫోర్బ్స్ 30లో చోటు దక్కించుకున్న హైదరాబాదీలు.. కేటీఆర్ ప్రశంసలు..
Ravi Kiran
|

Updated on: Apr 03, 2020 | 6:28 PM

Share

Forbes 30 Under 30 Asia: ప్రస్తుతం యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. ఇలాంటి వేళ ఓ ఆసక్తికరమైన వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ఫోర్బ్స్ 30 తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మన తెలుగు తేజాలు ఆరుగురికి చోటు దక్కడం విశేషం.

30 అండర్ 30 ఆసియా పేరుతో విడుదలైన ఈ జాబితాలో పది విభాగాలకు గానూ మొత్తం 300 మందిని ఎంపిక చేశారు. ఇక అందులో భారత్ నుంచి 69 మంది ఎంపిక కాగా.. వారిలో ఆరుగురు తెలుగువారు ఉన్నారు. వినూత్నంగా అలోచించి కొత్త తరహ వ్యాపారాలను తెరపైకి తీసుకురావడమే కాకుండా వాటిల్లో వీరు విజేతలుగా నిలిచారని ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది.

మరోవైపు ఈ ఆరుగురిలో ఐదుగురు హైదరాబాదీలు కావడం.. ఇక వారి ఘనతకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడం జరిగింది. ప్రేమ్‌ కుమార్‌ (మారుత్‌ డ్రోన్స్‌), అశ్విన్‌ మోచర్ల (దీ థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ), సందీప్‌ బొమ్మి (యాడ్‌ ఆన్‌ మో), విహారి (అర్బన్‌ కిసాన్‌), పవన్‌ కుమార్‌ చందన (స్కై రూట్‌ ఏరోస్పేస్‌)లు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇప్పటి యువతరం వినూత్నమైన ఐడియాలతో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న యువ పారిశ్రామికవేత్తలకు ఎలప్పుడూ సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

ఇది చదవండి: ఏపీలో కరోనా పంజా.. ఆ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ మరింత కఠినతరం..!