బెజవాడలో నకిలీ పోలీసుల హల్చల్
విజయవాడలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము పోలీసులమని బెదిరించి.. మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము పోలీసులమని బెదిరించి.. మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు అసలు పోలీసులకు చెప్పడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు సోదరుడి కుమారుడు, ఏ. ఆర్ ఎస్.ఐ తనయుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
కాగా విజయవాడలో గంజాయి వినియోగం పెరగినట్లు వార్తలు వస్తున్నాయి. యువత పెద్ద ఎత్తున గంజాయికి బానిస అయ్యిందని, బెజవాడలో చాలా ఈజీగా మత్తు పదార్థం దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గంజాయి ముఠాలపై ఫోకస్ పెట్టి..యువతను పక్కదారి పట్టకుండా చూడాలని కోరుతున్నారు.
Also Read :