Oxygen Plants: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక.. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు: సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి

Oxygen Plants: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక.. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు: సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us

|

Updated on: Apr 27, 2021 | 4:33 PM

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి పైగా మరణించారు. బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో రాజధాని ఢిల్లీలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెల చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వీటిలో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వమే తీసుకుందని తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత తీవ్రంగా వేధిస్తుందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు.. వెంటనే ఉత్పత్తి ప్రారంభించే స్థితిలో ఉన్న మరో 21 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.

గత వారం తీవ్రస్థాయికి చేరుకున్న ఆక్సిజన్ కొరత ప్రస్తుతం కాస్తంత సద్దుమణిగిందని, సకాలంలో పరిస్థితిని కొంత మేర చక్కదిద్దగలిగామని కేజ్రీవాల్ తెలిపారు. కొత్త రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. కాగా.. ప్రాణవాయువు రవాణా వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 70 టన్నుల ఆక్సిజన్‌తో మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ 70 టన్నులను ఏయే ఆస్పత్రులకు కేటాయించాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది.

కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మరణిస్తున్నారు. నిన్న ఆక్సిజన్ కొరతతో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా తదితర ప్రాంతాల్లో 12 మంది వరకు మరణించారు. దీంతోపాటు రెండు రోజుల క్రితం ఢిల్లీలో దాదాపు 50 మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Ramdan Thofa: కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు రాష్ట్ర సర్కార్ అండ.. రంజాన్ తోఫా పంపిణీ ప్రారంభించిన మహమూద్ అలీ

ఎండాకాలంలో కూడా పాదాలు పగులుతున్నాయా ? అయితే ఇలా చేయండి.. సమస్యను దూరం పెట్టండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..