AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలపడుతున్న భారత రక్షణ వ్యవస్థ.. కొత్త ఆయుధాల కొనుగోలుకు డిఎసి ఆమోదముద్ర

కేంద్ర ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ దేశ రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. త్రివిధ దళాల పటిష్టానికి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ప్రోత్సహిస్తున్నారు.

బలపడుతున్న భారత రక్షణ వ్యవస్థ.. కొత్త ఆయుధాల కొనుగోలుకు డిఎసి ఆమోదముద్ర
Balaraju Goud
|

Updated on: Dec 18, 2020 | 2:08 PM

Share

కేంద్ర ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ దేశ రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. త్రివిధ దళాల పటిష్టానికి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఆయుధ సంపత్తి కొనుగోలుకు భారత రక్షణ శాఖ పూనుకుంది. త్రివిధ దళాల కోసం రూ.28 వేల కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ నేతృత్వంలోని ‘ది డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డిఎసి) ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

తూర్పు లఢఖ్‌ ప్రాంతంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఆయుధాల కొనుగోళ్లకు ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ పరిశ్రమల నుంచే ఈ కొత్త ఆయుధాలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆమోదించబడిన ప్రతిపాదనల్లో భారత వైమానిక దళం కోసం డిఆర్‌డిఓ రూపొందించిన ఆయుధా సంపత్తిని కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా వాయుమార్గంలో ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలు.. అదేవిధంగా భారత సైన్యానికి మాడ్యులర్‌ వంతెనలు ఉన్నాయి. వీటిలో భారత వాయు సేనకు సంబంధించిన 6 ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్‌ విమానాలు కూడా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే, 9వేల కోట్ల వ్యయంతో నేవీ కోసం 11 తదుపరి తరం ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ వెసెల్స్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!