జీఎస్​టీ రిటర్న్​ దాఖలుకు 3నెలలు గడువు పెంపు

2018-19 ఫైనాన్సియ‌ల్ ఇయ‌ర్ కి సంబంధించిన వార్షిక జీఎస్​టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్​టీ రిటర్న్స్‌ దాఖలు చెయ్యడానికి టైమ్ లిమిట్ ను 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్‌ చేసింది. లాక్‌డౌన్‌లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్‌ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు […]

జీఎస్​టీ రిటర్న్​ దాఖలుకు 3నెలలు గడువు పెంపు
Follow us

|

Updated on: May 06, 2020 | 10:25 PM

2018-19 ఫైనాన్సియ‌ల్ ఇయ‌ర్ కి సంబంధించిన వార్షిక జీఎస్​టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్​టీ రిటర్న్స్‌ దాఖలు చెయ్యడానికి టైమ్ లిమిట్ ను 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్‌ చేసింది. లాక్‌డౌన్‌లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్‌ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును మే 31 వరకు పొడిగించింది.