AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాపై ‘ఫొని’ ఉగ్రరూపం… 50,000 గ్రామాలు… 50 నగరాలకు ముప్పు

అధికారులు అంచనా వేసినట్టే ‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచికలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు  11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తరలించారు. బాధితుల కోసం 5,000 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 కిచెన్లు ఏర్పాటు చేసి వంటలు […]

ఒడిశాపై 'ఫొని' ఉగ్రరూపం... 50,000 గ్రామాలు... 50 నగరాలకు ముప్పు
Ram Naramaneni
|

Updated on: May 03, 2019 | 12:02 PM

Share

అధికారులు అంచనా వేసినట్టే ‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచికలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు  11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తరలించారు. బాధితుల కోసం 5,000 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 కిచెన్లు ఏర్పాటు చేసి వంటలు వండుతున్నారు. ఒడిశాలో మొత్తం 50 నగరాలు, 10,000 గ్రామాలపై ఫొణి తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం… #OdishaPrepared4Fani పేరుతో హ్యాట్ ట్యాగ్ క్రియేట్ చేసి… ట్విట్టర్‌ ద్వారా తుఫాను బాధితులతో టచ్‌లో ఉంటోంది. తుఫాను విషయంలో ఒడిశాకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని ఏపీ సిఎం చంద్రబాబు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రస్తుతం తుఫాను పూరీ తీరాన్ని తాకింది. అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా వీల్లేనంతగా రాకాసి గాలులు వీస్తున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. 20 ఏళ్లలో ఈస్థాయి భారీ తుఫాను ఎప్పుడూ ఒడిశాపై విరుచుకుపడలేదని అధికారులు తెలిపారు.