చైనా, ఇండియాలోని ఆ ప్రాంతాలను ఆక్రమించిందా..?
గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఖచ్చితమైన పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చైనా సైనికులు డజన్ల కొద్దీ కొత్త కోటలు, బంకర్లను అక్కడ నిర్మించారని వార్తలు వినిపిస్తున్నాయి.
గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఖచ్చితమైన పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చైనా సైనికులు డజన్ల కొద్దీ కొత్త కోటలు, బంకర్లను అక్కడ నిర్మించారని వార్తలు వినిపిస్తున్నాయి. మే ప్రారంభం నుండి పాంగోంగ్ తో పాటు భారతదేశం తన సొంత భూభాగంగా పరిగణించిన దానిలో దాదాపు 8 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని వారు భౌతికంగా ఆక్రమించినట్లు తెలుస్తోంది. ద్వైపాక్షిక సైనిక చర్చలు జరుగుతున్న సమయాన్ని ఉపయోగించుకుని చైనా దళాలు ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించాయి. అయితే ప్రస్తుతం గల్వాన్ వ్యాలీ ప్రాంతంలో భారత సైన్యం పట్టు సంపాదించింది.
జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రరూపం తాల్చాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి.