AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 గంటల్లో 76.61 కిలో లీటర్ల పాల దిగుబడితో ఆవు రికార్డ్

పాల దిగుబడిలో పంజాబ్ కి చెందిన ఆవు రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 76.61 కిలో లీటర్ల పాలను అందించింది. కర్నాల్‌లోని హోల్‌స్టీన్ ఫ్రెసియన్ జాతికి చెందిన జోగన్ అనే ఆవు ఈ ఘనత సాధించింది.

24 గంటల్లో 76.61 కిలో లీటర్ల పాల దిగుబడితో ఆవు రికార్డ్
Balaraju Goud
|

Updated on: Jun 21, 2020 | 1:57 PM

Share

పాల దిగుబడిలో పంజాబ్ కి చెందిన ఆవు రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 76.61 కిలో లీటర్ల పాలను అందించింది. కర్నాల్‌లోని హోల్‌స్టీన్ ఫ్రెసియన్ జాతికి చెందిన జోగన్ అనే ఆవు ఈ ఘనత సాధించిందని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI) శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది క్రాస్ బ్రీడ్ ఆవు కావడం వల్లే అత్యధికంగా పాల ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.

పంజాబ్ లోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నీలోఖేరి బ్లాక్‌లోని గాలిబ్ ఖేరి గ్రామానికి చెందిన బల్దేవ్ సింగ్ 70 ఆవులను పెంచుతున్నాడు. 2014 లో పన్నీమేకర్ ఎబిఎస్ యుఎస్ఎ నుంచి దిగుమతి చేసుకున్న వీర్యం ఉపయోగించడం ద్వారా జోగన్ జన్మించింది. నాలుగేళ్ల వయసు కలిగిన ఈ ఆవు ఒక రోజులో 42 కిలోల పాలను ఇచ్చిందని బల్దేవ్ సింగ్ చెప్పారు. ఇది క్రమక్రమంగా పెరిగిందన్నారు. తనకు ఉన్న అన్ని పశువుల కంటే జోగన్ ఉత్తమ ఆవు అని, అనేక అవార్డులను కూడా దక్కించుకుందని అన్నారు. జోగన్ రెండు, మూడు చనుబాలివ్వడం ద్వారానే 54 కిలో లీటర్లు, 62 కిలో లీటర్ల పాలను ఇచ్చింది. ఇంతకుముందు నేషనల్ లైవ్‌స్టాక్ ఛాంపియన్‌షిప్‌లో 66.20 కిలోల పాల ఉత్పత్తి ద్వారా పంజాబ్‌లోని బటాలాలో అగ్రి ఎక్స్‌పో -2020 అవార్డును సొంతం చేసుకుందని బల్దేవ్ సింగ్ తెలిపారు. లూధియానాలో జరిగిన 10 వ పిడిఎఫ్‌ఎ ఇంటర్నేషనల్ డెయిరీ, అగ్రి ఎక్స్‌పో -2015 ను కూడా ఆవు గెలుచుకుందని గుర్తు చేశారు.

శనివారం, ఎన్‌డిఆర్‌ఐ శాస్త్రవేత్తలు బల్దేవ్ సింగ్, ఆయన సోదరుడు అమన్‌దీప్ సింగ్‌లను సన్మానించారు. క్రాస్ బ్రీడ్ ఆవు ద్వారా అత్యధిక పాల ఉత్పత్తి సాధ్యమైందని జంతువుల పెంపకం ప్రిన్సిపల్ సైంటిస్ట్ వికాస్ వోహ్రా తెలిపారు. పంజాబ్‌లో ఇప్పటి వరకు 72 కిలో లీటర్లు, కర్నాల్‌లో 65 కిలో లీటర్ల పేరుతో ఉన్న రికార్డును జోగన్ 24 గంటల వ్యవధిలో 76.61 కిలో లీటర్ల పాల దిగుబడితో కొత్త ఘనత సాధించిందన్నారు వికాస్ వోహ్రా. ఎన్‌డిఆర్‌ఐ డైరెక్టర్ ఎంఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. బల్దేవ్ సింగ్ మరియు అతని సోదరుడు 2010-11 సంవత్సరంలో నిర్వహించిన పాడి జంతువుల శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణ శాస్త్రీయ సంతానోత్పత్తి,అధిక దిగుబడి కోసం జంతువులను పోషణ తెలుసుకోవడం వారికి సహాయపడిందని చౌహాన్ చెప్పారు.