AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జ‌రుగుతాయ‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్ప‌ష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుంద‌ని చెప్పారు.

AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
AP Education Minister adimulapu suresh on 10th exams
Follow us

|

Updated on: Apr 28, 2021 | 6:03 PM

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జ‌రుగుతాయ‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్ప‌ష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుంద‌ని చెప్పారు. అన్ని జిల్లాల్లో అధికారులు కొవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు. మే 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేస్తామ‌ని మంత్రి సురేష్ స్ప‌ష్టం చేశారు. ఎగ్జామ్స్ పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కోవిడ్‌ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు వివ‌రించారు. పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల‌ ఆర్టీసీ అధికారులకు క‌లెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి .

కృష్ణా జిల్లాలో పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ ఇంతియాజ్ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఇంటర్మీడియెట్‌ మే 2021 ప‌రీక్ష‌ల‌ నిర్వహణపై కలెక్టర్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఇంతియాజ్‌.. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంట‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జిల్లాలో మొత్తం 142 ఎగ్జామ్ సెంట‌ర్స్ ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 సెంట‌ర్స్ ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1 లక్షా 12 వేల 154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ రాయ‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read: టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న సీఎం జగన్

 అసలే కరోనా కాలం.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం.. ఈ పదార్థాలను అస్సలు తినకండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..